Pages

Sunday, June 16, 2013



        ENGLISH  

 తెలుగులో 
        LINKS(లింక్స్)
1




AGRICULTURE



వ్యవసాయం గురించి 
                                               
2
ADVICE TO PARENS
 పిల్లల సంక్షేమం గురించి 
www.safekids.com



3



AIRLINES









 విమాన సర్వీసుల గురించి  




        OTHER SERVICES

4


ANDRAPRADESH


       ఆంధ్రప్రదేశ్  
5
APPLICATIONS

6
ARMY

7



AUTO MOBILS


ఆటోమొబైల్స్ గురించి 
8
AWARDS
 అవార్డ్స్ గురించి 
9

AYURVEDA

 ఆయుర్వేదం గురించి 

10
Dr.Br.AMBEDKAR





Sunday, June 9, 2013

బతుకమ్మ



బతుకమ్మ







బతుకమ్మ పండుగ 
 ఇతర చోట్ల పూలు, నీళ్లతో జరుపుకునే పండుగలు ఎన్ని ఉన్నా, అవి ఏవీ కూడా బతుకమ్మపండుగతో సరిపోలవు.
ఈ పండుగ వర్షాకాలపు చివరిలో, శీతాకాలపు తొలి రోజులలో వస్తుంది. అప్పటికే వర్షాల వలన చెరువలన్నీ మంచి నీటితో నిండి ఉంటాయి.
పండుగ సంబరాలు 

ఈ పండుగ సద్దుల బతుకమ్మ (బతుకమ్మ చివరి రోజు మరియు దసరాకు రెండు రోజుల ముందర) రోజుకు 
ఈ పూలని జాగ్రత్తగా ఒక రాగి పళ్ళెం (తాంబలం)లో వలయాకారంగా, రంగులు మార్చుకుంటూ పేరుస్తారు.
పండుగ కధ 

ఇంకొక వృత్తాంతములో దక్షిణ భారతాన్ని పాలించిన చోళ వంశ చక్రవర్తి ధర్మాంగదుడు సంతానము లేక అనేక పూజలు పునస్కారాలు
బతుకమ్మ పండుగ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తెలంగాణా ప్రాంతములో ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి 
తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ (గౌరి) పండగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది.
సెప్టంబరు, అక్టోబరు నెలలు తెలంగాణా ప్రజలకు పండుగల నెలలు. ఈ నెలలలో రెండు పెద్ద పండుగలు జరపబడతాయిఈ పండుగలకు 
కనీసం పదిహేను రోజులు అటువైపు, ఇటువైపు అంతా పండుగ సంరంభాలు, కుటుంబ కోలాహలాలు కలయకలుతో నిండిపోయుంటుంది. 
ఈ పండుగలలో ఒకటి బతుకమ్మ పండుగ, మరియొకటి దసరా (విజయ దశమి). అయితే బతుకమ్మ పండుగ మాత్రం, తెలంగాణకు 
మాత్రమే ప్రత్యేకమయినపండుగ. తెలంగాణ సాంస్కృతిక ప్రతీక ఈ పండుగ.
రకరకాల పువ్వులు రంగు రంగులలో ఆరుబయలలో పూసి ఉంటాయి. వీటిలో గునుక పూలు, తంగేడి పూలు బాగా ఎక్కువగా పూస్తాయి.
 బంతి, చేమంతి, నంది వర్ధనం
 లాంటి పూలకు కూడా ఇదే సమయం. సీతాఫలాలు (శిల్పక్క పండ్లు అంటారు) కూడా ఈ సమయంలో ఒక పెద్ద ఆకర్షణ.
 సీతాఫలాన్ని పేదవాని ఆపిల్ అంటారనేది తెలిసినదే. 
అలాగే జొన్న పంట కోతకు సిధ్ధంగా తలలూపుతూ ఉంటుంది. వీటన్నింటి నేపధ్యంలో తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి 
సౌందర్యాన్ని అద్భుతమయిన రంగురంగుల పువ్వులతో కీరిస్తూ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు.


ఒక వారం ముందు మొదలవుతుంది. ఈ రోజుల్లో ఆడపడుచులు అందరూ అత్తవారింటి నుంచి కన్నవారింటికి చేరుకుని 
స్వేచ్ఛావాయువులు పీలుస్తూ ఈ పూల పండుగ జరుపుకోవటానికి తయారవుతారు.
ఈ వారం రోజులలో వీరు రోజూ చిన్న బతుకమ్మలు చేసి, ప్రతీ సాయంత్రం దాని చుట్టూ తిరుగుతూ ఆడుతారు. 
ఆ తరువాత దగ్గరలో ఉన్న జలాలలో నిమజ్జనం చేస్తారు.
అయితే చివరి రోజు అత్యంత మనోహరంగా ఉంటుంది. ఆ రోజు మగవారంతా పచ్చిక బయళ్ళలోనికి పోయి తంగేడి, 
గునుక పూలను భారీగా ఏరుకుని వస్తారు. ఆ తరువాత ఇంటిళ్ళపాదీ కూర్చుని ఆ గునగ పూలు, తంగేడు, కలువ,
 మరియు ఇతర రకాల పూలతో బతుకమ్మని తయారు చేస్తారు. ఇందులో గునగ పూలు మరియు తంగెడు పూలు ముఖ్య భూమిక ను
 పోషిస్తాయి.


 ముందుగా తంగెడు ఆకులు, పూలు పళ్లెంలో లేదా తాంబోలం లో పేర్చుతారు, ఆపై తంగేడు పూలతో కట్టలుగా కట్టిన కట్టలను 
చివరలు కోసి రంగులతో అద్దిన వాటిని పేర్చుతారు. మధ్య మధ్యలో 
ఇతర రకాల పూలను ఉపయోగిస్తారు.
 ఈ అమరిక ఎంత పెద్దదిగా ఉంటే అంత అందంగా ఉంటుంది. తెల్లని గునుక పూలను రంగులతో అద్ది, మధ్యలో తంగేడి పూలను పెడతారు. 
పేర్చడం అయ్యాక పైన పసుపుతో 
చేసిన గౌరి మాతను పెట్టి చుట్టు దీపాలతో అలంకరిస్తారు. దీనిని గృహంలో దైవ స్థానంలో అమర్చి పూజిస్తారు. ఇలా తయారు చేసిన 
బతకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరి దేవిని కీర్తిస్తూ 
ఆడవారు పాడుతారు. ఆడవారు వారికి ఉన్న అన్ని రకాల ఆభరణాలను దరించి కొత్త బట్టలు కట్టుకుంటారు. ఇలా చాలా సేపు 
ఆడాక మగవారు వాటిని చెరువులో నిమజ్జనం చేస్తారు. 
ఆపై ఆ పళ్లెంలో తెచ్చిన నీటితో ఆడవారు వాయినమమ్మా వాయినం అంటూ వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు.
ఆపై ఇంటి నుండి తీసుకువచ్చిన పెరుగన్నం మరియు సత్తుపిండి( మొక్కజొన్నలు, లేదా
 వేరుశనగ లేదా పెసర విత్తనాలను దోరగ వేయించి వాటిని పిండి చేసి వాటితో చక్కెర పిండి లేదా బెల్లం మరియు నెయ్యి తగినంత కలిపి
 తయారు చేస్తారు)లను ఇచ్చి పుచ్చుకొని తింటారు
చివరి రోజు సాయంత్రం, ఆడపడుచులు అందరూ చక్కగా దుస్తులు,
 అభరణాలు ధరించి బతుకమ్మను వాకిలిలో పెడతారు. చుట్టుపక్కల ఉన్న వారు 
కూడా వారి బతుకమ్మలను ఇదే విధంగా అమర్చి వాటి చుట్టూ పెద్ద వలయాకారంలో
 చేరుతారు. ఐక్యత, సోదరభావం, ప్రేమను కలపి రంగరిస్తూ మానవ హారం ఏర్పరిచి 
పాటలు పాడుతారు. ఒకరు ముందుగా పాట మొదలుపెడితే మిగిలినవారు 
వారితో గొంతు కలుపుతూ పాడుతారు. ఈ జానపద గీతాలు చుట్టు పక్కలా 
ప్రతిధ్వనిస్తూ ప్రత్యేకమైన తెలంగాణా సంస్కృతిని ఆవిష్కరిస్తాయి.


చీకటి పడుతుంది అనగా,స్త్రీలందరూ ఈ బతుకమ్మలను తలపై పెట్టుకుని ఊరిలో 
ఉన్న పెద్ద చెరువు గానీ, తటాకంవైపు గానీ ఊరేగింపుగా బయలుదేరుతారు. 
ఈ ఊరేగింపు అందంగా అలంకిరించుకున్న స్త్రీలు, బతుకమ్మలతో అత్యంత 
సుందరంగా, వైభావయానంగా ఉంటుంది.ఈ ఊరేగింపు కొనసాగినంత సేపూ, 
జానపద గీతాలతో వీధులు మారుమోగుతాయి. 
జలాశయం చేరుకున్న తరువాత, మెల్లగా బతుకమ్మలను
 పాటలు పాడుతూ,
ఆడుతూ నీటిలో జారవిడుస్తారు. ఆ తరువాత "మలీద" (చక్కెర మరియు రొట్టెతో చేసినది) అనే పిండి వంటకాన్ని 
బంధు మిత్రులకు పంచిపెడతారు.
 ఆ తరువాత ఖాళీ తాంబలంతో పాడుతూ, బతుకమ్మను కీర్తిస్తూ ఇంటికి చేరుతారు. ఈ వారం రోజులూ,
ఈ పాటలన్నీ అర్ధరాత్రి వరకూ వీధులలో మారు మ్రోగుతూనే ఉంటాయి.


ఈ బతుకమ్మ పండుగ వెనుక చాల కథలు ఉన్నాయి. బాగా ప్రాచుర్యంలో ఉన్నదిది : 
ఒక బాలిక భూస్వాముల ఆకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంటే, ఆమెను ఆ ఊరి ప్రజలు చిరకాలం "బతుకమ్మా !" అని 
దీవించారంట అందుకనే ఈ పండుగ స్త్రీలకు సంబంధించిన, బతుకమ్మను కీర్తిస్తూ జరుపుకునే పండుగ. స్త్రీలందరూ
 ఈ సందర్భంగా వారు ఎటువంటి ఆపదల పాలు కారాదనీ, పతులు మరియు కుటుంబం చల్లగా ఉండాలనీ గౌరమ్మను ప్రార్ధిస్తారు.

 చేయగా ఈయన భార్య గర్భవతియై లక్ష్మీ దేవి అనుగ్రహముతో ఒక కూతుర్ని కన్నది. పసిబిడ్డైన లక్ష్మి అనేక గండములను గట్టెక్కినది 
కావున ఈమె తల్లితండ్రులు బతుకమ్మా అని నామకరణము చేసినారు. అప్పటినుండి యువతులు మంచి భర్తను ప్రసాదించాలని కోరుతూ 
బతుకమ్మను కొలవడము ఆన్వాయితీ అయ్యిందని ఈ కథ చెబుతున్నది.
బతుకమ్మ పండుగ ప్రకృతిని అరాధించే పెద్ద పండుగ. పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృధ్ధిగా పొంగి పొరలే 
సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి, భూమితో, జలంతో, మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకోబడుతుంది. 
ఈ సంబరాలు జరుపుకునే వారం అంతటా స్త్రీలు "బొడ్డెమ్మ" (మట్టితో చేసే దుర్గాదేవి బొమ్మ) ను బతుకమ్మతో పాటూ చేసి
 నిమజ్జనం చేస్తారు.

Saturday, June 8, 2013

గుడ్ ఫ్రైడే




యేసుని శిలువలో వేసిన రోజే గుడ్ ఫ్రైడే..!

క్రైస్తవ పరమాత్ముడు ఏసుక్రీస్తును శిలువలో వేసిన రోజే గుడ్‌ఫ్రైడేగా పరిగణించబడుతోంది. గుడ్ ఫ్రైడే, హోలీ ఫ్రైడే, బ్లాక్ ఫ్రైడే లేదా గ్రేట్ ఫ్రైడే అని కూడా పిలువబడే ఈ రోజున క్రైస్తవ సోదరులు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు, పూజల్లో పాల్గొంటారు.
ఏసుక్రీస్తును శిలువ వెయ్యటం మరియు కాల్వరి వద్ద అతని మరణం యొక్క జ్ఞాపకాలను ఈ రోజున క్రైస్తవులు నెమరువేసుకుంటారు. పవిత్ర వారం సమయంలో పవిత్రమైన మూడు రోజులలో భాగంగా ఈస్టర్ ఆదివారానికి ముందు వచ్చే శుక్రవారం రోజున క్రైస్తవులు ప్రార్థనలతో జీసస్‌ను ప్రార్థిస్తారు.
క్రీస్తు యొక్క సంహేద్రిన్ ప్రయత్నం గురించి రచించబడిన వివరాల ఆధారంగా క్రీస్తును శిలువ వెయ్యటం దాదాపుగా శుక్రవారమే జరిగింది. రెండు వేర్వేరు సమూహాలచే గుడ్ ఫ్రైడే యొక్క సంవత్సరం ఏడీ 33గా అంచనా వెయ్యబడింది. వాస్తవానికి బైబిలికల్ మరియు జూలియన్ క్యాలెండర్ల మధ్య ఉన్న వ్యత్యాసాలు మరియు చంద్రవంక ద్వారా ఐజాక్ న్యూటన్‌చే ఏడీ 34 గా చెప్పబడింది.
కాబట్టి గుడ్‌ఫ్రైడే రోజున క్రైస్తవ సోదరులు ఏసుక్రీస్తును నిష్టతో పూజిస్తే.. పుణ్య ఫలితాలతో అనుగ్రహిస్తాడని విశ్వాసం. ఇంకా పవిత్ర వారమంతా ఉపవాసముండి ఈస్టర్ విందు తీసుకునే వారికి

క్రిస్టమస్



     క్రిస్టమస్




క్రిస్టమస్ క్రైస్తవులకు ముఖ్యమైన పండగ. ఏసు క్రీస్తు పుట్టిన రోజును ఈ రోజు జరుపుకుంటారు. కొంతమంది క్రైస్తవులు డిసెంబర్ 25న, మరికొంత మంది ఆర్థడాక్స్ చర్చిలకు చెందిన క్రైస్తవులు జనవరి 7న క్రిస్టమస్‌ను జరుపుకుంటారు. చారిత్రక మరియు సందర్భోచిత ఆధారాల ప్రకారం ఏసుక్రీస్తు డిశంబరులో పుట్టి ఉండకపోవచ్చు. ఈ రోజును ఒక రోమన్ల పండగ రోజు అయినందునో లేదా వింటర్ సోల్టీస్ అయినందునో క్రిస్టమస్ జరుపుకోవటానికి ఎంచుకున్నారు.

యేసు (Jesus) (క్రీ.పూ 7–2 నుండి క్రీ.శ 26–36 వరకు) , నజరేయుడైన యేసుగా కూడా పిలవబడే ఈయన క్రైస్తవ మత మూలపురుషుడు. అంతకాక, యేసు వివిధ ఇతర మతములలో కూడ ప్రముఖమైన వ్యక్తిగా పరిగణించబడినాడు. ఈయన సాధారణంగా యేసు క్రీస్తుగా కూడ వ్యవహరించబడతాడు. ఇందులో క్రీస్తు అన్న పదము గ్రీకు భాషలో క్రీస్తోస్ ("ఆభిషిక్తుడు") అనే అర్ధం వచ్చే పదం నుండి పుట్టిన ముకుటం. ఇది హీబ్రూలో "మెసయ్యా"కు సమానార్ధము కలపదము

యేసు (Jesus) (క్రీ.పూ 0 నుండి క్రీ.శ 26–36 వరకు) [1] నజరేయుడైన యేసుగా కూడా పిలవబడే ఈయన పేరిట క్రైస్తవ మతము పౌలు గారిచే అంతియొకయలో ప్రారంబించబడింది.ఈయన యేసు క్రీస్తుగా కూడ వ్యవహరించబడతాడు. క్రీస్తు అన్న పదము గ్రీకు భాషలో క్రీస్తోస్("ఆభిషిక్తుడు")నుండి పుట్టింది.ఇది హీబ్రూలో "మెసయ్యా"కు సమానం.

కొత్త నిబంధన గ్రంథం లోని నాలుగు సువార్తలు మత్తయి, మార్కు, లూకా మరియు యోహాను సువార్తలలో యేసు జీవితము మరియు బోధనలకు సంబంధించిన సమాచారం ఉంది.చాలా మంది బైబిలు పరిశోధకులు మరియు చరిత్రకారులు యేసు, గలిలయకు చెందిన ఒక యూదు మత బోధకుడని,బాప్తిస్మమిచ్చు యోహానుచే బాప్తిస్మము పొందాడనీ, తనను తాను దేవుని ఎకైక అద్వితీయ కుమారుడని తద్వార దేవునికి సమానుడనే, రోమన్ సామ్రాజ్యాన్ని మాయచేస్తున్నాడనే ఆరోపణలతో రోమన్ అధికారి పొంతి పిలాతు ఆజ్ఞానుసారము శిలువ వేయబడ్డాడని అంగీకరిస్తారు.
యేసుక్రీస్తుపై విభిన్న క్రైస్తవ ధృక్కోణాలు పాతనిబంధన గ్రంథం లేదా యూదు తోరాహ్ లో వస్తాడని చెప్పిన మెసయ్య లేదా క్రీస్తు ఈయనే అని, ఈయన సిలువవేయబడిన తరువాత సమాధి నుండి లేచి వచ్చాడనే భావనల పై కేంద్రీకృతమై ఉన్నాయి. అధిక శాతం క్రైస్తవులు యేసుని, తమ పాప ప్రక్షాళన కొరకు మరియు దేవునితో సమాధానపరుచుటకు పంపబడిన దేవుని కుమారుడిగా భావిస్తారు. త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్మే క్రైస్తవులు యేసుని దేవుని యొక్క అవతారంగా భావిస్తారు.యేసు దైవత్వము సంబంధంచిన గూఢార్థాల విద్యను క్రిస్టోలొజి అని పిలుస్తారు.కన్యకు పుట్టటం,పరలోక ప్రయాణం , రెండవ రాకడ.అద్భుతాలు. యేసు పాత నిబంధన గ్రంథం లోని ప్రవచనాలను నెరవేర్చారని నమ్ముతారు.
యేసు జీవిత కాలం: యేసు జీవిత చరిత్ర నాలుగు సువార్తల్లో ఉందిగాని, యేసు క్రీస్తు పుట్టిన తేదీలేదు.పశ్చిమ దేశములలోని క్రైస్తవులు అంతా క్రీస్తు జన్మదిన పండుగగా క్రిస్టమస్ ను డిసెంబరు 25 వ తేదీన ఆనయాయతీగా జరుపుకొంటున్నారు.రోమా క్రైస్తవులు సుమారు క్రీ.శ.330 నుండి అలా జరుపుకొంటున్నారు.


బక్రీద్



బక్రీద్ పండుగ.


ముస్లింల పండుగల్లో బక్రీద్ పండుగ ఒకటి. ఈ పండుగకు ఈదుల్..అజహా, ఈదుజ్జహా, లేక బక్రీద్ అని కూడా అంటారు. ఇస్లామ్ క్యాలెండర్ ప్రకారం 12వ నెల జిల్‌హేజ్‌ 10వ తేదీన బక్రీద్ పండుగను ముస్లింలు జరుపుకుంటారు.


ఇస్లాంలోని ఐదు ప్రధాన సూత్రాలలో ఒకటైన హజ్‌ ‌తీర్థయాత్రను ముస్లింలు చేయాల్సివుంటుంది. ఈనెల ప్రారంభంలోనే ముస్లిం ప్రజలు భక్తి ప్రపత్తులతో హజ్ తీర్థయాత్రకు బయలుదేరతారు.

హజ్ యాత్రకొరకు సౌదీ అరేబియా‌లోని మక్కా నగరానికి చేరుకుని మస్జిద్..ఉల్..హరామ్‌లోవున్న కాబా చుట్టూ 7 ప్రదక్షిణలు చేసి మసీదులో ప్రార్థనలు చేస్తారు. ఈ మసీదు కాబా గృహం చుట్టూ ఉంది. ప్రపంచంలోని ముస్లింలందరూ కాబా వైపు తిరిగి నమాజు (ప్రార్థనలు) చేస్తారు. దీనినే ఖిబ్లా అని కూడా అంటారు. 

హజ్ తీర్థయాత్రకు వెళ్ళినవారు మక్కానుండి మదీనా (ముహమ్మద్ (సొ.అ.స) ప్రవక్త గోరీ ఉన్ననగరం)ను సందర్శిస్తారు. అల్లాహ్ ఆదేశానుసారం ఇబ్రహీం (సొ.అ.స) తన ఏకైక పుత్రుడైన ఇస్మాయిల్‌ను బలి ఇవ్వడానికి సిద్ధమౌతారు. ఆ సంప్రదాయాన్ని స్మరిస్తూ ముస్లింలు ఈ బక్రీద్ పండుగను జరుపుకుంటారు. 

రంజాన్‌లాగే బక్రీద్ పండుగను కూడా ఖుద్బా (ధార్మిక ప్రసంగం)తో ఈద్గా‌లో సామూహిక ప్రార్థనలు జరుపుతారు. ఆతర్వాత వారు నెమరు వేసే జంతువులను (ఒంటె, మేక, గొర్రె, ఎద్దు) మాత్రమే ఖుర్బానీ (బలి) ఇస్తారు. బలి ఇచ్చిన తర్వాత దానిని మూడు భాగాలుగా విభజించి ఒక భాగాన్ని పేదలకు, మరొక భాగాన్ని బంధువులకు పంచుతారు. ఇంకొక భాగాన్ని తమ కోసం ఉంచుకుంటారు. ముస్లింలు త్యాగానికి ప్రతీకగా ఈ బక్రీద్ పండుగను జరుపుకుంటారు.

రంజాన్‌


పరమ పధానికి పవిత్ర మాసం రంజాన్‌


లైఫ్

రంజాన్‌మాసం వచ్చిందంటే చాలు ఉపవాసదీక్ష (రోజా) పాటించేందుకు ముస్లింలంతా సిద్ధమవుతారు. ఇస్లాంలో రోజాకు ఎంతో ప్రాధాన్యత ఉంది. పిల్లలకు ఏడేళ్ళ వయసునుంచే రోజా నియమాల గురించి తల్లిదండ్రులు చెబుతుంటారు. యుక్తవయసు వచ్చిన తర్వాత రంజాన్‌మాసంలో ఉపవాసం ఉండటం అందరికీ ఫర్జ్‌ (తప్పనిసరి) అవుతుంది. మనంచేసే సత్కార్యాలకు అల్లా వివిధ మార్గాలలో ప్రతిఫలం అందజేస్తాడు. అయితే రోజా ఉండేవారికి అల్లా సాక్షిగా ఉండటమే కాకుండా, దానికి ప్రతిఫలం కూడా అల్లా ద్వారా నేరుగా అందుతుంది. రంజాన్‌ ఉపవాసదీక్షల్లో ఆరోగ్య సూత్రాలే కాకుండా, సమయపాలన, నియమ నిబంధనలు దాగి ఉన్నాయి. తెల్లవారుజామునే నిద్రలేవడం, సూర్యోదయానికి ముందే సహర్‌ చేయడం, రోజూ ఐదుపూటల నమాజ్‌ చేయడం, సూర్యాస్తమయ సమయంలో ఇఫ్తార్‌ తదితర కార్యక్రమాలతో రంజాన్‌మాసంలో ముస్లింల దైనందిన జీవితం ఒక క్రమపద్ధతిలో సాగుతుంది.
పవిత్రతే పరమపద సోపానంగా
ముస్లిం సోదరులు భావించే మాసం రంజాన్‌. పసిపిల్లల నుంచి పెద్దవారి వరకు
అందరి హృదయాలలో పవిత్రతని..
అంతకు మించిన భావనని నింపే మాసం ఇదే..
మానవాళికి ముక్తి మార్గాన్ని చూపించేందుకు
దైవం పంపిన పరమ పవిత్రమైన ''ఖురాన్‌'' గ్రంథం అవతరించిన మాసమిది.
అందునా మన భారతావనిలో
పరమత సహనానికీ ప్రతీకగా నిలచేలా
ఈ పండుగ జరుపుకోవటం ఆనవాయితీ....
రంజాన్‌ లేదా రమదాన్‌ ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం మతస్తులు ఆచరించే ఒక ఉపవాస దీక్షా వ్రతం మరియు ఇస్లామీయ కేలండర్‌లోని ఒక నెల పేరు నెలల క్రమంలో తొమ్మిదవది.పండుగ, పర్వదినం అంటే శుభవేళ, ఉత్సవ సమయం అని అర్థం. పండుగలు మన జీవన స్రవంతిలో భాగమై మన జాతీయతకు, సంస్కృతీ వికాసానికి దోహదం చేస్తున్నాయి. పండుగ అనేది ఏ మతానికి సంబంధించినదైనా సరే.... దాని వెనుక ఒక సందేశం దాగి ఉంటుంది. పండుగ మానావాళికి హితాన్ని బోధిస్తుంది. ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే రంజాన్‌ పండుగ సైతం ఇదే హితాన్ని మావవాళికి అందిస్తుంది. తెలుగు వారి మాదిరిగానే ముస్లింలు 'చాంధ్రమాన కేలండర్‌''ను అనుసరిస్తారు. చాంధ్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ కేలండర్‌ తొమ్మిదవ నెల రంజాన్‌. దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దానికి ప్రధానమైన కారణం. దివ్వ ఖురాన్‌ గ్రంథం ఈ మాసంలో ఆవిర్భవించడమే! క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే. రంజాన్‌ మాసం.
ఆత్మ ప్రక్షాళనకు త్రికరణ శుద్ధితో ఉండే ఉపవాస వ్రతాన్నే ''రోజా'. ఈ ఉపవాసాల వలన మానవాళి చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం లభిస్తుంది. ఆకలి కోసం అలమటించే అన్నార్తుల బాధలను స్వయంగా అనుభవించడమే ఈ ఉపవాసాల ఉద్దేశం. దీనివల్ల ఉపవాసం ఉన్న వారిలో సాటివారిపట్ల సానుభూతితోపాటు దైవ చింతన కూడా కలుగుతుందని భావన. ఈ నెల రోజుల పాటు రాత్రి వేళ ''తరావీహ్‌'' నమాజును నిర్వహిస్తారు. ప్రతి వంద రూపాయలకు రెండున్నర రూపాయల చొప్పున పేదలకు ''జకాత్‌'' పేరుతో దానం చేస్తారు. ''ఫిత్రా'' రూపంలో పేదలకు గోధుమ పిండిని దానం చేస్తారు. జకాత్‌, ఫిత్రాల పేరుతో అన్నార్తులకు వితరణ చేయడం పుణ్యాన్నిస్తుంది. మహమ్మద్‌ ప్రవక్త బోధించిన నియామాలను అనుసరించి ప్రతి రోజూ సూర్యదోయంలో జరిపే ''సహరి'' నుంచి, సూర్యాస్తమం వరకు జరిపే ''ఇఫ్తార్‌'' వరకు మంచి నీళ్లను సైతం త్యజించి కఠోర ఉపవాస దీక్ష చేపడతారు. అతిధులు, అభ్యాతుల సాంగత్యంలో సహరీలు ఇఫ్తార్లు జరుపుకుంటారు. ఉపవాస వ్రతాలను ఆచరించడం వల్ల మనుషుల్లో వారి వారి దైనందిన జీవితాల్లో తప్పకుండా మార్పులు సంభవిస్తాయి. గతం కంటే వారు ఎంతో పవిత్రంగా, శాంతికాముకులుగా పరివర్తన చెందుతారు. రంజాన్‌ స్త్రీ, పురుషులందరూ ఉపవాస వ్రతాన్ని తప్పనిసరిగా పాటించాలని ఆదేశించిన భగవంతుడు చిన్న పిల్లలకు, వృద్ధులకు, కొన్ని ప్రత్యేక పరిస్థితులలో స్త్రీలకు, వ్యాధిగ్రస్తులకు కొన్ని మినహాయింపులు ప్రసాదించాడు. వీరందరికీ ఉపవాస వ్రతం నుంచి మినహాయింపు ఉంది. కేవలం ఆహారం తీసుకోకపోవడమే ఉపవాస లక్షణం కాదు. ఆహారంతోపాటు వారు చెడు ప్రవర్తనకూ, చెడు చేష్టలకు కూడా దూరంగా ఉండాలి. ఈ లక్ష్యాన్ని ప్రతి సోదరుడూ గుర్తెరిగి దీక్ష వహిస్తాడు. కాబట్టి వారిలో దైవ భీతితో కూడిన నిస్వార్ధపర్వతం పెంపొంది ఆత్మ శుద్ధి చేసుకుని భగవంతుని దీవెనలు పొందుతారు.
నిష్ట నియమాలు

రాఖీ పౌర్ణమి


రాఖీ పౌర్ణమి 



రక్షాబంధన్ కు భారతీయ సంస్కృతిలో ఎంతో ప్రాధాన్యం ఉంది. అన్న చెల్లెల అనుబంధానికి ప్రతీక రాఖీ. దీనికి సంబంధించి భారతీయ పురాణాల్లో పలు కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి.
రాక్షస రాజయిన బలిచక్రవర్తి తన భక్తితో శ్రీహరిని తన ఇంట్లో బంధిస్తాడు. అప్పుడు మహాలక్ష్మి ఓ సామాన్య స్త్రీగా మారి బలిచక్రవర్తి ఇంటికి వచ్చి అతనిని సోదరునిగా భావించి చేతికి రక్షాబంధన్‌ను కడుతుంది. దీంతో ఏమి బహుమతి కావాలో కోరుకోమని చక్రవర్తి అడుడుతాడు. వెంటనే మహాలక్ష్మి తన నిజస్వరూపంలోకి వచ్చి తన స్వామిని విడిచి పెట్టాలని కోరుతుంది. దీంతో శ్రీహరిని విడిచిపెడతాడు.
అలాగే శ్రీకృష్ణుడికి మణికట్టు వద్ద దెబ్బ తగిలి రక్తం కారుతుంటే ద్రౌపది తన చీర చించి కట్టుకడుతుంది. కౌరవ సభలో దుశ్శాసనుడు ద్రౌపదిని చీరలాగుతుండగా శ్రీకృష్ణుడు చీరను ఇచ్చి ఆమె గౌరవాన్ని కాపాడు తాడు.
కర్ణావతి అనే మహిళ చిత్తోర్‌గడ్‌ రాణిగా ఉండేవారు. భర్త అకాల మరణంతో రాజ్యభారం ఆమె మీద పడుతుంది. దీంతో ఇది సరైన సమయంగా భావించిన గుజరాత్‌ సుల్తాన్‌ బహుదూర్‌ షా చిత్తోర్‌ గడ్‌పై తన సేనలతో దండెత్తుతాడు. అతనిని ఎదుర్కొనేందుకు ఏమి చేయాలో పాలుపోని కర్ణావతి సాయం చేయాలని కోరుతూ మొఘల్‌ చక్రవర్తి హుమాయూన్‌కు ఒక రాఖీని పంపుతుంది. ఈ రాఖీతో కర్ణావతిని తన సోదరిగా భావించిన చక్రవర్తి ఆమెకు అండగా నిలువడమే కాకుండా బహుదూర్‌షాను యుద్ధంతో ఓడిస్తాడు. ఈ చారిత్రక ఘటనకు సాక్ష్యం ఈ రాఖీ. అప్పటి నుండి ఈ పండుగను ఉత్తర భారతీయులు జరుపుకుంటూ వస్తున్నట్టు ఇంకో కథనం ఉంది.

///////////////////////////////////////////////////////////////////////////////////////////////////////////////////////////////////////////////////////////////////////////////////////////////

అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్య ఉండే ప్రేమానురాగాలకు శుభసూచకంగా జరుపుకునే పండుగను 'రాఖీ' లేదా 'రక్షాబంధన్'‌ అంటారు. దీనికి 'రాఖీ పౌర్ణమి' అనే మరో పేరు కూడా ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. కొంతకాలం క్రితం వరకు ఉత్తర, పశ్చిమ భారతదేశంలో మాత్రమే ఈ పండుగను చాలా వైభవంగా జరుపుకునేవారు. ఇప్పుడు దేశమంతా విస్తరించింది. 

అన్నకుగాని తమ్మునికిగాని ప్రేమ సూచకంగా సోదరి రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ముఖ్యోద్ధేశం. అంతేకాకుండా.. జీవితాంతం తమకు రక్షణ కల్పించమని దీని ప్రధానాంశం. దీన్ని ఏడాదికో మారు గుర్తుచేసేందుకే అన్నదమ్ములకు అక్కచెల్లెళ్ళు రాఖీ కడుతారు. నాటి ఉమ్మడి కుటుంబాల్లో రక్షాబంధన్‌కు అత్యంత ప్రాముఖ్యత ఉండేది. ఇది ప్రస్తుతం చిన్న కుటుంబాల్లో విస్తరించడంతో మరింత ఆదరణ పెరిగింది. 

చరిత్ర పుటలను ఒకసారి తిరగేస్తే.. సోదర భావంతో పంపిన రాఖీలు యుద్ధాలను ఆపాయి. రక్తపాతాన్ని నివారించాయి. రాజ్యాలు కూలిపోకుండా చేశాయి. సరికొత్త అనుబంధాలను సృష్టించాయి. దీనికి ఈ ఉదాహరణే మచ్చుతునక. కర్ణావతి అనే ధీరవనిత చిత్తోర్‌గఢ్ రాణిగా ఉండేవారు. భర్త అకాల మరణంతో రాజ్యభారాన్ని ఆమె మోయాల్సి వచ్చింది.
పొడి పొడి ఆప్యాయతల రక్షా రేకు
  రక్షాబంధన్ పవిత్రత కాలంతోపాటు మారిపోయింది. మారుతున్న ట్రెండ్‌‌కు అనుగుణంగా జరుపుకోవడం ఆరంభమైంది. 'ప్రేమా... గీమా' అంటూ వెంటపడేవారిని వదిలించుకోవడానికి 'అన్నా' అంటూ బహుమతులను ఒడిసి పట్టేందుకూ పొడి పొడి అప్యాయతలు రాఖీలతో వ్యక్తపరచడం వాడుకగా మారింది      


ఇదే సరైన సమయంగా భావించిన గుజరాత్ సుల్తాన్ బహుదూర్ షా చిత్తోర్‌గఢ్‌పై తన సేనలతో దండెత్తాడు. ఏమి చేయాలో పాలుపోని కర్ణావతి.. సాయం కోరుతూ మొఘల్ చక్రవర్తి హుమయూన్‌‌కు ఒక రాఖీని పంపుతుంది. 

ఈ రాఖీతో కర్ణావతిని సోదరిగా భావించిన మొఘల్ చక్రవర్తి కర్ణావతికి అండగా నిలువడమే కాకుండా.. బహుదూర్‌ షాను యుద్ధంలో ఓడిస్తాడు. ఈ చారిత్రక ఘటనకు సజీవ సాక్ష్యం ఈ రాఖీ. అప్పటి నుంచి రాఖీ పండుగను ఉత్తర భారతీయులు జరుపుకుంటూ వస్తున్నట్టు ఒక వాదన కూడా వుంది. ఇలాంటి మరుపురాని మధుర స్మృతులెన్నో చరిత్రలో దాగివున్నాయి. 

అలా.. ఎంతో పవిత్రమైనదిగా భావించే ఈ రక్షాబంధన్ పవిత్రత కాలంతోపాటు మారిపోయింది. మారుతున్న ట్రెండ్‌‌కు అనుగుణంగా జరుపుకోవడం ఆరంభమైంది. 'ప్రేమా... గీమా' అంటూ వెంటపడేవారిని వదిలించుకోవడానికి 'అన్నా' అంటూ బహుమతులను ఒడిసి పట్టేందుకూ పొడి పొడి అప్యాయతలు రాఖీలతో వ్యక్తపరచడం వాడుకగా మారింది. హృదయ పొరల్లో ఆర్థ్రత లోపించడం... ఓ సంప్రదాయంగా మాత్రమే రక్షాబంధన్‌ మిగిలిపోవడం విచారకరం.


....................................................................................................................................................................................................

శ్రీ హనుమజ్జయంతి


యత్ర యత్ర రఘునాధ కీర్తనం
తత్ర తత్ర కృతమస్తకాంజలీం|
బాష్పవారి పరిపూర్ణలోచనం
మారుతిం నమత రాక్షసాంతకం||

             శ్రీ అంజనేయ స్వామి వారి భక్తులకు ఇది ముఖ్యమైన పర్వదినము. వైశఖబహుళదశమి నాడు మనము హనుమజ్జయంతి జరుపుకుంటాము. భక్తతులసిదాస్ కు సాక్షాత్కారం ఇచ్చి ఇప్పటికిని హిమాలయాలలో చిరంజీవిగా తపస్సు చేసుకొనుచున్నాడు. ' రామాయణంలోని అంజనేయుడు జీవించి వుంటాడా? ' అని ఆశ్చర్యపోనక్కరలేదు. ఆయన చిరంజీవి  అతులిత బలధాముడు మహాయోగి.

పూజా విధానం :
హనుమంతుని పటం పూజా మందిరంలో పెట్టి షొడశోపచారములతొ పూజ చేయాలి. స్వామి వారికి మనకు తోచిన నైవెద్యం పెట్టి హనుమాన్ చాలీసా, సుందరాకాండ పారాయణ చేయాలి. అలా చేసిన అన్ని రంగాలలోను ఎనలేని విజయం చేకూరుతుంది.

కృష్ణాష్టమి


కృష్ణాష్టమి


        ద్వాపర యుగములో రోహిణి నక్షత్ర యుక్త శ్రావణ బహుళ అష్టమినాడు శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణునిగా అవతరించాడు ఈ రోజును కృష్ణాష్టమిగా జరుపుకుంటాము.ఈ రోజు వేకువతోనే లేచి కాలకృత్యాలు తీర్చుకొని తులసీదళాలు వేసిన నీటితొ స్నానం చేయాలి.అలా చేస్తే సమస్త నదుల్లొ స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది.పగలు ఉపవాసం వుంటూ పూజా కార్యక్రమం జరుపవలెను. ఈ రోజు చిన్ని కృష్ణుని పాదాలు వేయడం అనవాయితి.అలా చేస్తే చిన్ని కృష్ణుడు వస్తాడని పూర్వం నుండి నమ్మకం. పూజ ముగిసిన తర్వత పాలతో  కాని, పెరుగుతో కాని, అటుకులతో  చేసిన నైవేద్యం పెట్టాలి.

నైవేద్యం : 

అటుకుల పాయసం:
కావలసినవి:
అటుకులు  -  పావు కేజీ,
పాలు     -  లీటరు,
చక్కెర - పావుకేజీ,
ఏలకుల పొడి - అర టీ స్పూన్,
జీడిపప్పు - పది పలుకులు,
కిస్‌మిస్   - పది
నెయ్యి   -  జీడిపప్పు, కిస్‌మిస్ వేయించడానికి తగినంత

తయారి:
ముందుగా పాలను సగానికి ఇంకే వరకు మరిగించాలి. ఈ లోపుగా అటుకులలో ఉండే సన్నని దుమ్ము, పొట్టు పోయేటట్లు నీటిలో వేసి పిండి అరబెట్టలి. పాలు కాగిన తర్వాత ఏలకుల పొడి, అటుకులు వేసి కలిపి దించేయాలి. చివరగా నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్‌తో అలంకరించాలి.

వినాయక చవితి


వినాయక చవితి

            భారతీయుల తొలి పండుగ వినాయక చవితి. ఈ పండుగ తర్వాతనే మిగితా పండుగలన్నీ ప్రారంభమవుతాయి. భాద్రపదమాసంలో చతుర్దశినాడు వినాయక చవితి జరుపుకుంటాము. వినాయక చవితినాడు పూజ గదిని అలంకరించుకోవాలి ముందుగా మామిడి ఆకులు కట్టి మందహాసం మీద బియ్యం పోసి ఒక రూపాయ నాణమును పెట్టి దాని మీద గణపతి ప్రతిమను పెట్టాలి. మందహాసం ఇరుప్రక్కల అరటి స్తంభాలు,కలువ పూలు,మొక్క జొన్న బొత్తులు కట్టాలి. మొదట గౌరమ్మ ప్రతిమను పసుపుతో చేసుకోవాలి గౌరీపూజ చేసుకొని ఆ తర్వాత స్వామివారిని 21రకాల పత్రితో,పూలతో పూజించాలి. చదువుకునే పిల్లలు వారి పుస్తకాలను స్వామివారి వద్ద ఉంచడం ఆనవాయితీ. వినాయక వ్రతమును యధావిధిగా ఆచరించి పూజ చేసుకోవాలి.చివరిన శమంతకోపాఖ్యనం విని అక్షింతలు తలపై చల్లుకుంటే చంద్రున్ని చూసినా నీలాపనిందలు రావని మన పూర్వికుల విశ్వాసము.

వినాయక వ్రత విధానం:

ప్రార్థన:
శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం|

ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే||
సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః
ధూమకేతు ర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కంద పూరజః
షోడశైతాని నామాని యః పఠేచ్ఛృణుయా దపి
విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గయే తథా
సఙ్గ్రమే సర్వ కార్యేషు విఘ్నస్తస్య నజాయతే
అభీప్సితార్థసిద్ధ్యర్థం పూజితో యస్సురైరపి
సర్వవిఘ్నచ్చిదే తస్మైగణాధి పతయే నమః ||

సంకల్పం:
ఓం మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శొభనే ముహూర్తే అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, భరత వర్షే, భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే అస్మిన్(ఆయా ప్రంతాలకు మార్చుకోవాలి) వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్తి సంవత్సరానాం మధ్యే శ్రీ .......(సంవత్సరం పేరు చెప్పాలి) నామసంవత్సరే, దక్షినాయనే, వర్షఋతౌ, భాద్రపదమాసే, శుక్లపక్షే , చవితితిధౌ, ......వాసర యుక్తాయాం,శుభనక్షత్ర, శుభయోగ, శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం,శుభతిదౌ, శ్రీ మాన్ .....(పేరు చెప్పాలి), గోత్రః .........(గోత్రం పేరు చెప్పాలి) నామధేయస్య, ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ, స్థైర్య, విజయ ఆయురారొగ్య ఐశ్వర్యాభివ్రుధ్యర్ధం, ధర్మార్ధ కామమోక్ష చతుర్విద ఫలపురుషార్ధ సిద్ధ్యర్ధం, ఇష్ట కామ్యార్త సిద్ధ్యర్ధం, మనోవాంచ ఫల సిద్ధ్యర్ధం, సమస్థ దురితోపశంత్యర్తం, సమస్థమంగళావాప్త్యర్ధం వర్షే, వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక చతుర్ధీ ముద్ధిష్య, శ్రీ వరసిద్ధివినాయక దేవతా ప్రీత్యర్తం కల్పొక్త ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యానా వాహనాది షొడషొపచార పూజాం కరిష్యే (నీళ్లు తాకవలెను). 
అదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్ధం గణాధిపతి పూజాం కరిష్యే తదంగ కలశపూజాం కరిష్యే.


కలశ పూజ:
కలశం గంధ్పుష్పాక్షతైరభ్యర్చ్య (కలశమునకు గంధపు బొట్లు పెట్టి అక్షితలద్ది లోపల ఒకపుష్పమునుంచి ఆ పాత్రపై కుడి చేతితో మూసి ఈ క్రింది మంత్రమును చేప్పుకోవాలి ).

కలశస్య ముఖే విష్ణు: కంఠే రుద్ర స్సమాశ్రిత:|
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాత్రు గణా: స్మృతా:||
కుక్షౌతు సాగరా: సరేసప్త దీపా వసుంధరా|
ఋగ్వేదొ విధ యజుర్వేద: సామవేదొ హ్యధర్వణ:||
అంగైశ్చ సహితా: సర్వే కలశాంబు సమాశ్రితా:|
ఆయంతు దేవ పూజార్థం దురితక్షయ కారకా:||
గంగేచ యమునే చైవ గొదావరి సరస్వతి|
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు||
కలశొదకేన పూజా ద్రవ్యాణి దేవమండపఆత్మానంచ సంప్రొక్ష్య (కలశములొని నీటిని పూజ ద్రవ్యములపైన మన పైన చల్లుకోవాలి).

ఇప్పుడు పసుపుతో వినాయకుడిని చేసుకోవాలి.

                                 గణపతి పూజ
ఓం గణాంత్వాం గణపతిం హవామహె కవింకవీనా ముపమశ్రవస్తమం
జ్యేష్ట రాజం బ్రహ్మణం బ్రహ్మణస్పత్య: ఆనశ్రుణ్వన్నూతిభిసీద సాదనం
మహాగణపతయే నమః ధ్యాయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి.
పాదయోః పాద్యం సమర్పయామి
హస్తయోః అర్ఘ్యం సమర్పయామి
ముఖే ఆచమనీయం సమర్పయామి
ఔపచారిక స్నానం పరికల్పయామి
వస్త్ర యుగ్మం సమర్పయామి
ఆభరణార్థం అక్షతాన్ సమర్పయామి
గంధం ధారయామి
హరిద్ర కుంకుమ పరిమళద్రవ్యాణి సమర్పయామి
పుష్పైః పూజయామి

ఓం  సుముఖాయ నమః
ఓం  ఏకదంతాయ నమః
ఓం  కపిలాయ నమః
ఓం  గజకర్ణాయ నమః
ఓం లంబోదరాయనమః
ఓం వికటాయనమః
ఓం విఘ్నరాజాయనమః
ఓం గణాధిపాయనమః
ఓం ధూమకేతవేనమః
ఓం గణాధ్యక్ష్యాయనమః
ఓం ఫాలచంద్రాయనమః
ఓం గజాననాయనమః
ఓం వక్రతుండాయనమః
ఓం శూర్పకర్ణాయనమః
ఓం హేరంబాయనమః
ఓం స్కంద పూర్వజాయనమః
ఓం శ్రీ మహాగణాధిపతయేనమః
ఓం పుష్పైః పూజయామి

నానావిధ పరిమళ పత్ర పుష్పైః పూజయామి , ధూప మాఘ్రాపయామి , సాక్షాద్దీపం దర్షయామి , నైవేద్యం పరికల్పయామి , ఊగీఫలతాంబూలం సమర్పయామి , కర్పూరనీరజనం దర్శయామి, నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి.

నమస్తే దేవదేవేశ నమస్తే గణనాయక
పార్వతీశంకరోత్సంగఖేలనోత్సవలాలన
సమస్త జగదధార వరమూషిక వాహన

ప్రార్ధనాం సమర్పయామి

                                      అథ ప్రాణ ప్రతిష్ఠ:
ఓం అసునీతే పునరస్మాసు చక్షుః పునః మిహనో ధేహి భోగం జ్యోక్పశ్యేమసూర్య ముచ్చరం తమనుమతే మృళయా నస్వస్తి
స్వామిన్ సర్వజగన్నాధ యావత్పూజావసానకం |
తావత్త్వం  ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధింకురు.
ఆవాహితోభవ, స్థాపితోభవ, సన్నిహితోభవ, సుప్రసన్నోభవ, వరదోభవ
మమ ఇష్టకామ్యార్థ ఫలసిద్ధిదోభవ 

                                   సిద్ధి వినాయక పూజ:
ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం
పాశాకుశధరందేవం ధ్యాయే త్సిద్ధి వినాయకం
ధ్యాయేద్గజాననం దేవం తప్తకాంచనసన్నిభం
చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం
ధ్యాయామి ఆవహయామి
మౌక్తికై పుష్యరాగైశ్చ నానారత్న విరాజితం|
రత్న సింహాసనం చారు ప్రీత్యర్ధం ప్రతి గృహ్యతాం||
ఆసనం సమర్పయామి
గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక|
భక్త్యా పాద్యం మయాదత్తం గృహాణద్విరదానన|
పదయోః పాద్యం సమర్పయామి.
గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన|
గ్రుహాణార్ఘ్యం మయా దత్తం గంధపుష్పాక్షతైర్యుతం|
హస్తయోః అర్ఘ్యం సమర్పయామి
ఆనాధనాధ సర్వజ్ఞ గీర్వాణ పరిపూజిత|
గ్రుహాణచమనం దేవతుభ్యం దత్తం మయా ప్రభొ
ముఖే ఆచమనీయం సమర్పయామి.
దధ్యాజ్య మధుసంయుక్తం మధుపర్కం మయాహృతం
గ్రుహాణ సర్వలోకేశ గణనాధానమోస్తుతే
మధుపర్కం సమర్పయామి.
పయోదధిఘృతం చైవ శర్కరా మధుసంయుతం
పంచామృతేన స్నపనం క్రియతాంగణనాయక
పంచామృతస్నానం సమర్పయామి.
గంగాది సర్వతీర్ధేభ్యః ఆహృతై రమలైర్జలై:
స్నానం కురుష్వ భగవన్ ఉమాపుత్ర నమోస్తుతే
శుద్ధొధకేన స్నపయామి
రక్తవస్త్ర ద్వయంచారు దేవయోగ్యంచ మంగళం
శుభప్రదం గ్రుహాణత్వం లంబోదర హరాత్మజ
వస్త్రయుగ్మం సమర్పయామి.
రాజితం బ్రహ్మసూత్రంచ కాంచనం చొత్తరీయకం
గృహాణ దేవ సర్వజ్ఞ భక్తా భీష్ట ప్రదాయక
యజ్ఞోపవీతం సమర్పయామి
నానావిధాని దివ్యాని నానారత్నోజ్వలానిచ
భూషణాని గృహాణేశ పార్వతీ ప్రియనందన
దివ్యాభరణాని సమర్పయామి
చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం
విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్ధం ప్రతి గృహ్యతాం
గంధాన్ ధారయామి.
హరిద్రా కుంకుమ పరిమళ ద్రవ్యాణి అక్షతాంశ్చ సమర్పయామి
సుగంధాని సుపుష్పాణి జాతే కుంద ముఖానిచ
ఏకవింశతిపత్రాణి సంగృహాణ నమోస్తుతే
పుష్పైః పూజయామి

                                         ఆధాంగ పూజా :
గణేశాయ నమః పాదౌ పూజయామి|
ఏకదంతాయ నమః గుల్ఫౌ పూజయామి|
శూర్పకర్ణాయ నమః జానునీ పూజయామి|
విఘ్నరాజాయ నమః జంఘే పూజయామి|
అఖువాహనాయ నమః ఊరూ పూజయామి|
హేరంబాయ నమః కటిం పూజయామి|
లంబొదరాయ నమః ఉదరం పూజయామి|
గణనాధాయ నమః నాభిం పూజయామి|
గణేశాయ నమః హృదయం పూజయామి|
స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి|
స్కందాగ్రజాయ నమః స్కందౌ పూజయామి|
పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి|
గజవక్త్రాయ నమః వ్క్త్రం పూజయామి|
విఘ్నహంత్రే నమః నేత్రే పూజయామి|
శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి|
ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి|
సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి|
విఘ్నరాజయ నమః సర్వాణ్యంగాని పూజయామి|

21 రకాల పత్రి:
మాచీ పత్రం
గరిక
ఉత్తరేణి ఆకు
గన్నేరు ఆకు
దేవదారు ఆకు
జాజిమల్లి ఆకు
రావి ఆకు
వాకుడు ఆకు
ఉమ్మెత్త ఆకు
తులసీ ఆకు
విష్ణుక్రాంత ఆకు
మరువం ఆకు
దేవకాంచనం ఆకు
తెల్లమద్ది ఆకు
బిల్వం పత్రం
రేగు ఆకు
మామిడి ఆకు
దానిమ్మ ఆకు
వావిలి ఆకు
జమ్మి ఆకు
జిల్లేడు ఆకు


మకర సంక్రాంతి


మకర సంక్రాంతి

సూర్యుడు ఒక్కొక్క నెలలో ఒక్కో రాశిలోకి వస్తూ మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అలా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్నే 'మకర సంక్రమణం' లేదా 'మకర సంక్రాంతి' అని పిలవడం జరుగుతోంది.మూడు రోజుల పాటు జరుపుకునే ఈ పండుగ తొలి రోజు భోగీ, రెండో రోజు మకర సంక్రాంతి, మూడో రోజు కనుమగా జరుపుకుంటారు. సంక్రాంతి నుండి ఉత్తరాయన పుణ్య కాలం మొదలై ఆరు నెలల వరకు ఉంటుంది. ఇది దేవ కాలము, ఎంతో శుభదాయకమైనది.ఈ మూడు రోజులూ పండుగే కనుక, దీన్ని పెద్ద పండుగ అంటారు.

మొదటి రోజు భోగి ఈ రోజు ఇళ్ళ ముంగిళ్ళను రంగవల్లులు, గొబ్బెమ్మలతో అలంకరిస్తారు. ముగ్గులు వేయటానికి ప్రత్యేకంగా బియ్యపు పిండిని వాడతారు. భోగినాడు భోగి మంటలు వెలిగిస్తారు. దీనిని సంవత్సరంలో ఆ కాలంలో ఉండే చలి పారద్రోలటానికే కాక ఇంకో సందర్భంగా కూడా జరుపుకుంటారు అది ఏంటంటే ఇంట్లో ఉండే పనికి రాని పాత వస్తువులు వేస్తారు. కొత్తవాటితో నిత్య నూతన జీవితం ఆరంభించటానికి గుర్తుగా కూడా ఈ రోజున భోగి మంటలు వెలిగిస్తారు. ఆ సాయంత్రం పేరంటంలో పిల్లలకు భోగిపళ్లు పోస్తారు అనగా రేగిపళ్ళు, పప్పులు,చెరుకుముక్కలు, మరియు కొన్ని నాణాలను కలిపి పిల్లలపై ఆశీర్వాద సూచకంగా కుమ్మరించి దిష్టి తొలగిస్తారు. ఈ పేరంటానికి వచ్చినవారికి తాంబూలాలలో నూగులు, పప్పులు, బెల్లం కలిపి పెట్టడం ఆనవాయితి.




  



రెండవ రోజయిన సంక్రాంతి రోజున పాలు పొంగించి, దానితో పొంగలి తయారు చేస్తారు. ఇంకా ఈ రోజున రకరకాల పిండి వంటకాలు చేసి, కొత్తబట్టలు ధరించి ఈ పండుగను ఆస్వాదిస్తారు.ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు.ప్రతీ సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలి. కాని మిగిలిన పదకొండు సంక్రమణాలకు ఇవ్వక పోయినా, ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృ తర్పణాలు ఇస్తారు. సంక్రాంతి రోజులలో మనము చూసే ఇంకో సుందర దృశ్యం. గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దులవారు. చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ, డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటిచేత చేయించే నృత్యాలు చూడటానికి చాలా రమణీయంగా ఉంటాయి. ఆ గంగిరెద్దులు మనము ఇచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్లుగా తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోకాళ్ళ మీద వంగటం వంటి విద్యలు వాటికి నేర్పిస్తారు. కొత్త ధాన్యము వచ్చిన సంతోషముతొ ధాన్యము ఇస్తాము.





మూడవ రోజయిన కనుమ వ్యవసాయంలో తమకు ఎంతో చేదోడువాదోడు ఉన్నందుకు వ్యవసాయదారులు పశువులను నీళ్ళతో కడిగి శుభ్రం చేస్తారు.పసుపు కుంకుమలతో, పూలతో అలంకరిస్తారు. పశువులను పూజిస్తారు. కనుమ రోజు 'మినుము' తినాలని 'గారెలు' చేసుకొని తింటారు.