పాకాల సరస్సు
మానవ నిర్మితమైన 30చదరపు కి.మీ.ల ఈ సరస్సు క్రీ శ.1213 లో కాకతీయ రాజు గణపతి దేవునిచే కట్టించబడింది. నర్సంపేట పట్టణానికి 12కి మీ దూరం లో నున్న ఈ సరస్సు , చుట్టుప్రక్కల ఉన్న అభయారణ్యం , ప్రకృతిని ఆరాధించే వారికి ఇది ఒక స్వర్గము. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు పాకాల చెరువుగా పిలిచే ఈ చెరువు మధ్యలో ఉన్న కొండ అద్బుతమైనది. "పాకాల రామక్క గుండం" గా పిలవబడే ప్రదేశం లో ప్రజలు మొక్కులు సమర్పిస్తూ ఉంటారు. కోతులు,కొండముచ్చులు పుష్కలంగా ఉన్నాయి. చుట్టూ ప్రక్కల ఉన్న అడవి లో చిరుత పులులు, జింకలు, దుప్పులు, అడవి పందులు విరివిగా ఉన్నాయి
కోమరవల్లి
కోమరవల్లి , వరంగల్ జిల్లా, చేర్యాల మండలానికి చెందిన గ్రామము
సిద్ధిపేట నుండి సికింద్రాబాద్ వెళ్ళే మార్గంలో సిద్ధిపేటకు 20 కి.మీ, మ0డల0 చేర్యాలకి 10 కి.మీ. దూరంలో ఉన్న కోమరవల్లి మల్లన్న స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది . ఇక్కడ జాతర జనవరి నెలలో ప్రారంభమై ఉగాది వరకు జరుగుతుంది.
కొమురవెల్లి మల్లన్న స్వామీని బన్ద సొరికల వెలసిన దేవునిగా కీర్తిస్తారు. సుతిమాను గుండం మీద త్రిశూలం ఉంటుంది. దాని ప్రక్కనే రేణుకా ఎల్లమ్మ దేవాలయం. ఈ దేవుని ఎక్కువగ కురుమలు, గొల్లలు, కాపువారు పూజిస్తారు. గుడి ఎదురుగా గంగ రేగి వృక్షము కలదు. ఇక్కడ పత్నాలు వేసి బోనాలను, మొక్కుబడి కలవారు "కొర మీసాలను "సమర్పిస్తారు. ఈ జాతరలో శివ భక్తులు ప్రత్యేక అకర్షణ.

No comments:
Post a Comment